పాతదారిలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో నాపై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఎవరు నమ్మకండి నేను  పార్టీ మారడం లేదు

పాతదారిలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

IMG-20240620-WA0028                                        

కాంగ్రెస్ మోసపూరిత హామీలను కార్యకర్తలకు విశధికరిస్తూ, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఎలా కృషి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు  నేడు పర్వతగిరి లో మీటింగ్ పెట్టడం జరిగింది. 
    
కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత హామీలు ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ చేస్తానని ఇప్పటివరకు ఆ ఊసే లేదు, అదే పక్క రాష్ట్రంలో 4000 పెన్షన్  ఇస్తున్నారు, ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 

ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ కానే లేదు, ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే ప్రజలే వారికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ వాళ్లు  సోషల్ మీడియా వేదికగా చేసుకొని నేను పార్టీ మారుతానని దుష్ప్రచారం చేస్తున్నారు, వారు ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారాలు మాని ప్రజల బాగు కొరకు ఆలోచించి వారికి పనిచేస్తే బాగుంటుంది.రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ పూర్వ వైభవం రానుంది అని తెలిసి అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ వాళ్లు ఇలాంటి పనికిమాలిన ప్రచారాలను చేస్తున్నారు *నేను పార్టీ మారడం లేదు ఈ పార్టీలోనే ఉంటూ పార్టీ పూర్వ వైభవం కోసం పని చేస్తాను.* *మళ్లీ కెసిఆర్ సీఎం అయ్యేంతవరకు అహర్నిశలు కృషి చేస్తాను*

Read More ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు

Views: 47
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News