గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్....
గ్యాస్ ను డోర్ డెలివరి చేయాల్సిందే...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి.టి మాచన రఘునందన్....
నల్లగొండ జిల్లా, ఫిబ్రవరి 20, (న్యూస్ ఇండియా ప్రతినిధి):-

గ్యాస్ సిలిండర్ల ను ఇళ్ల వద్దకు చెరవేయాలని, డోర్ డెలివరి చేయాల్సిందేనని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డి టి మాచన రఘునందన్ స్పష్టం చేశారు.గురువారం నాడు రఘునందన్ మర్రిగూడ లో మాట్లాడుతూ..గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కొన్ని ప్రాంతాల్లో డోర్ డెలివరి ని ప్రహసనం చేస్తున్నాయని ఆక్షేపించారు. వినియోగదారుల సేవల్లో ఉదాసీనత ఉపేక్షించేది లేదని రఘునందన్ హెచ్చరించారు.గ్యాస్ బండల ను ఎక్కడో రోడ్డు మీద పెట్టి,పోవడం భావ్యం కాదని రఘునందన్ గ్యాస్ ఏజెన్సీ ల కు సూచించారు.గ్యాస్ డోర్ డెలివరి కి అయ్యే ఖర్చు ను ఆయా చమురు సంస్థలు డీలర్లకు చెల్లిస్తున్నాయన్నారు.వంట గ్యాస్ కు నిర్ణీత గరిష్ఠ చిల్లర ధర(ఎమ్.ఆర్.పి) ను మాత్రమే చెల్లించాలని రఘునందన్ వినియోగదారులకు సూచించారు.
Comment List