ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 06, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- నీజయితీపరులను గౌరవించాలనే లక్ష్యంతొ పనిచేసే "అవే" సంస్థ హైదరాబాద్ లోని రవీంద్రభారతి నిర్వహించిన కార్యక్రమం లో సూర్యాపేట జిల్లా, నూతనకల్ మండలం, చిల్పకుంట్ల గ్రామానికి చెందిన అంజపల్లి నాగమల్లు హైదరాబాద్ లో ట్రాఫిక్ విభాగంలో ఇన్స్పెక్టర్ కి రవీంద్రభారతి లో ఎన్.వి రమణ భారత సుప్రీం కోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా అందించడం జరిగింది. అంజపల్లి నాగమల్లు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు, గత 15 సంవత్సరాలుగా పోలీస్ విభాగలో పనిచేస్తూ అవినీతికి దూరంగా, లంచం తీసుకోకుండా, ప్రజలకొరకు పనిచేసే వారికీ అవే సంస్థ అవార్డులు అందించి వారిని అభినదిస్తునదని అవే సంస్థ వ్యవస్థాపకులు వైకుంఠం ప్రభాకర్ చౌదరీ తెలిపారు. అందుకే నాగమల్లు కి అవినీతి లేని వ్వక్తిగా ఈ అవార్డు అందించారు. ఈ అవార్డు ప్రధానోత్సవంలో చిన్నా రెడ్డి వైస్చైర్మన్ ప్లానింగ్ కమిషన్, మండలి బుద్ధప్రసాద్ మాజీ స్పీకర్, మండాది కృష్ణారావు పాండిచేరీ మాజీ మంత్రి, ఎం. నాగేశ్వరావు ఈనాడు జర్నలిజం ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

భారతదేశంలో అత్యుత్తమ పౌరులకి అందించే అవినీతి రహిత అవార్డు అందుకోవడం పట్ల, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేసారు.
Comment List