ధాన్యం సేకరణ ఓ క్రతువు..
డీ ఎస్ వో కోమాన్పల్లి శ్రీనివాస్..
ధాన్యం సేకరణ ఓ క్రతువు
డీ ఎస్ వో కోమాన్ పల్లి శ్రీనివాస్

ధాన్యం సేకరణ లో అధికారుల నిరంతర నిఘా తో నే ఎటువంటి సవాళ్ళ నైనా అధిగమించవచ్చనీ పౌర సరఫరాల శాఖ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి డి సి ఎస్ వో కొమాన్ పల్లి శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం నాడు ఆయన జూబ్లి హిల్స్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో ధాన్యం సేకరణ - సవాళ్ళు అనే అంశం పై నిర్వహిస్తున్న 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి గౌరవ అతిథి గా విచ్చేసి శిక్షణ లో ఉన్న అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ధాన్యం సేకరణ లో భారత ప్రభుత్వ ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) పౌర సరఫరాల శాఖ,పౌర సరఫరాల సంస్థ ల కీలక పాత్ర పై అవగాహన కలిగించారు. ఖరీఫ్, రబీ సీజన్ ల లో పంట ల గురించి వివరించారు.ఈ శిక్షణ లో ఎన్ఫోర్స్ మెంట్ డి.టి. మాచన రఘునందన్ తో పాటు పలు జిల్లాల కు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు, డి టి లు పాల్గొన్నారు.
Comment List