ఎల్లమ్మా..సిపిఎస్ రద్దు చేయవమ్మా.!

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

On
ఎల్లమ్మా..సిపిఎస్ రద్దు చేయవమ్మా.!

ఎల్లమ్మా..సిపిఎస్ రద్దు చేయవమ్మా.!

భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం ఎల్లమ్మ కు ప్రత్యేక పూజలు..

ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, మార్చి 16, న్యూస్ ఇండియా ప్రతినిధి:

Read More లక్కీ డ్రా తీసి గిఫ్ట్ ఇస్తాం అంటే...! ఫోన్ నెంబర్ ను ఇవ్వకండి...!!

IMG-20250316-WA0645
ప్రత్యేక పూజలు చేసిన ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్ తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలన్న తమ అభిమతం నెరవేరాలని కోరుతూ..ఎల్లమ్మ తల్లి కి ప్రత్యెక పూజలు చేసినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ చెప్పారు.ఆదివారం నాడు ఆయన సి పి ఎస్ రద్దు కోసం బల్కంపేట ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..మార్చి 23 న లో ఢిల్లీ లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం కార్యక్రమం ఉందని,అది విజయవంతం కావాలని ఎల్లమ్మ ను ప్రార్థించినట్టు చెప్పారు.పాలకులు ఎప్పటికప్పుడు సి పి ఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి పబ్బం గడుపు కుంటున్నారే తప్ప..పెన్షన్ తో ఉద్యోగుల ఆర్ధిక భద్రత ఆన్న విషయం వారికి పట్టడం లేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు అని దైవాన్ని దీనంగా అర్ధిస్తున్నామని రఘునందన్ వివరించారు. పాలకులకు సి పి ఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ పధకం ను పునరుద్దరించేలా బుద్ధి ప్రసాదించాలని కోరుతూ..దేవుళ్ళకు, దేవతలకు పూజలు చేస్తున్నామని రఘునందన్ వెల్లడించారు.కొంగ చంద్ర కళ, వల్లకాటీ నారాయణ, మోర మౌనిక, దాసరి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News