ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 11, న్యూస్ ఇండియా : ఫులే జీవితం, ఆయన బోధనలు అందరికీ మార్గదర్శకం అని, సమానత్వం, న్యాయం మరియు సామాజిక సామరస్యం యొక్క విలువలను నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారని జిల్లా ఎస్ పి తెలియచేసారు. శుక్రవారం రోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా, సంగారెడ్డి ఎమ్.ఎల్.ఎ క్యాంపు కార్యాలయం ప్రక్కన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ తో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపియస్ కలిసి మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని ఎస్పీ మాట్లాడుతూ.. జ్యోతిరావు ఫూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త, విద్య, మహిళా సాధికారత, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన న్యాయవాది అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులకు నివాళులు అర్పించడం అంటే వారి మార్గాన్ని అనుసరించడం, మెరుగైన సమాజం కోసం పనిచేయడమే అని ఎస్పీ అన్నారు.
Comment List