సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు...

On
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...

భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు...

ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ 
తెలంగాణ అధ్యక్షులు
మాచన రఘునందన్..

IMG-20250311-WA0584
భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు చేసిన: ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్  తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా, మార్చి 11 న్యూస్ ఇండియా ప్రతినిధి: భాగస్వామ్య పింఛను పథకం రద్దు కావాలన్న తమ అభిమతం నెరవేరాలని కోరుతూ.. సాయి నాథునికి ప్రత్యెక పూజలు చేసినట్టు నేషనల్ ఓల్డ్ పెన్షన్ రెస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ (ఎన్ ఓ పి ఆర్ యూ ఎఫ్)తెలంగాణ అధ్యక్షులు మాచన రఘునందన్ చెప్పారు. మంగళవారం ఆయన సిపిఎస్ రద్దు కోసం చింతపల్లి సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..మార్చి 23న ఢిల్లీ లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం కార్యక్రమం ఉందని, అది విజయవంతం చేయాలని సాయి నాధునికి ప్రార్థన చేసినట్టు చెప్పారు.పాలకులు ఎప్పటికప్పుడు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి పబ్బం గడుపు కుంటున్నారే తప్ప..పెన్షన్ తో ఉద్యోగుల ఆర్ధిక భద్రత ఆన్న విషయం వారికి పట్టడం లేదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు "న్యూ పెన్షన్ స్కీమ్ వద్దు మహా ప్రభో అని దీనంగా దైవాన్ని అర్ధిస్తున్నామని రఘునందన్ వివరించారు. పాలకులకు సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ పధకం ను పునరుద్దరించేలా బుద్ధి ప్రసాదించాలని కోరుతూ..దేవుళ్ళకు పూజలు చేసినట్టు రఘునందన్ వెల్లడించారు. ఆలయం నిర్వాహకులు రఘునందన్ ను సాయి చిత్రపటంతో సత్కరించి, అభీష్టం నెరవేరాలని ఆశీర్వదించారు.

Read More శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా. గ్రామంలో బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 18, న్యూస్ ఇండియా : పోతిరెడ్డిపల్లి గ్రామంలో  బొడ్డురాయి ఆధారశిల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ప్రజల...
సంగారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ లో తేదీ 21ఏప్రిల్ 2025 న జాబ్ మేళా.
సంగారెడ్డిలో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి ప్రత్యేక పూజలు..
బాధిత కుటుంబని పరామర్శించిన ఎమ్మెల్యే
విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేసినా, పోస్ట్ లు పెట్టినా చట్టరిత్యా కఠిన చర్యలు తప్పవు.
సమాజంలో అందరూ సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వా లక్ష్యం -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.