వికలాంగులకు ఆరువేల పెన్షన్, కూటమి నాయకులకు పాలాభిషేకం

By Khasim
On
వికలాంగులకు ఆరువేల పెన్షన్, కూటమి నాయకులకు పాలాభిషేకం

ఎన్నికలల్లో కూటమి అధినేతలు తమ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే వికలాంగులకు ఆరువేల పెంక్షన్ ను పెంచుతూ ఎన్డీయే కూటమి టీడీపీ అధినేత సిఎం చంద్రబాబు నాయుడు తొలిసంతకం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గల గాంధీ విగ్రహం ముందు వికలాంగుల కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బిసి సోమన్న ఆధ్వర్యం లో మహిళ అధ్యక్షురాలు ఎన్ నాగ శేషమ్మ ,ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షులు కే. రామాంజ నేయులు,జిల్లా కోశాధికారి అభిలాష, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ భాస్కర్, ఎం ఎస్ వి అధ్యక్షులు గుండా ల ఈశ్వరయ్య, రాజమనక్క, ఉద్యోగ సంఘాల కృష్ణ, గోనెగండ్ల మండల అధ్యక్షులు ఎం సుంకన్న, ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా ,ఎమ్మిగనూరు అధ్యక్షులు బి రంగన్న, పెద్ద ఎత్తున వికలాంగులు పాల్గొని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కు,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ల చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ వికలాంగుల ఉద్యమంలో పోరాట ఫలితంగా ఈరోజు వికలాంగులకు 6000 ప్రకటించడం జరిగినదని, రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల అందరూ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కు, వికలాంగులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.IMG-20240620-WA2034

Views: 74
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News