బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం

On
బచ్చోడు తండాలో గ్రామ పంచాయతీలో  భూసార పరీక్షలు  కార్యక్రమం విజయవంతం

IMG-20240530-WA0362 ఖమ్మం తిరుమాలయ పాలెం మండలం బచ్చోడు  తండా గ్రామపంచాయతీ  వద్ద రిలయన్స్ ఫౌండేషన్, ఎరిస్ ఆగ్రో వారు      సంయుక్తంగా, భూసార పరీక్షలు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెరుగైన పంట దిగుబడి మరియు ఈ పరీక్షల వల్ల 60% పంట దిగుబడి భూసరం మీద ఆధారపడి ఉంటుది. ఉపయోగించలిసిన ఎరువుల సంఖ్యను సూచిస్తుంది యని ఎరిస్ అగ్రో మేనేజర్ షేక్ అన్వర్ పాషా మొక్కల ఆరోగ్యం మరియు పోషక విలువలు గురించి వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ చీపుల్ల వరహాలు మాట్లాడుతూ రిలయన్స్ ఫౌండేషన్ సేవలు వాతావరణం, పంటల్లో వచ్చే వ్యాధులకు రోగ నిర్ధారణ చర్యల కొరకు పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు నివారించుట కొరకు ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా ప్రతినిధి చల్ల వెంకటేశ్వర్లు, ఎరిస్ జిల్లా సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, జూనియర్ సూపర్వైజర్ రాకేష్, ఉదయ్ రెడ్డి మరియు రైతులు ఇస్లావత్ వెంకన్న, దారావత్ మోహన్ ,భూక్య మల్సూర్ ,మోతిలాల్ ,శీను భూక్యా రాంబాబు దారావత్ శివ మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Views: 26
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...