తెలంగాణలో కాకరేపుతోన్న మునావర్‌ ఫరూఖీ టూర్‌

On

వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్‌.. జనవరి 9వ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తుండటంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేధించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. ప్రభుత్వంపై ఫైర్‌ అవుతున్నాయి. జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మునావర్‌ అరెస్ట్‌ అయ్యారు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడారని.. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో […]

వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్‌.. జనవరి 9వ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తుండటంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేధించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. ప్రభుత్వంపై ఫైర్‌ అవుతున్నాయి.

జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మునావర్‌ అరెస్ట్‌ అయ్యారు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడారని.. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో 37 రోజులు జైల్లో ఉన్న మునావర్‌.. సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో బయటకొచ్చారు. అప్పటి నుంచి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. మునావర్‌ షోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం.. బెంగళూర్‌, గుర్‌గావ్‌, రాయ్‌పూర్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, వడోదర, గోవా, ముంబైలలో మునావర్‌ ఫరుఖీ షోలు రద్దయ్యాయి. హిందూ సంఘాల హెచ్చరికలతో నవంబర్‌ 28న బెంగళూర్‌లో జరగాల్సిన షో కూడా రద్దయ్యింది.

మునావర్‌ చుట్టూ ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే.. మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌.. హైదరాబాద్‌, భోపాల్‌లలో షోలు చేసుకోవాడానికి ఆహ్వానించారు. ఇప్పుడిదే హిందూ
సంఘాల ఆగ్రహానికి కారణమవుతోంది. మరీ హైదరాబాద్‌లో షో జరుగుతుందో లేక మిగితా నగరాలలో మాదిరిగానే రద్దవుతుందో చూడాలి.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లాలో  నేడు ఆరెంజ్ అలర్ట్ జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 8: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు ఆరెంజ్ అలర్ట్  ఉన్నదాని ,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆరెంజ్ అలర్ట్...
మృతుడి కుటుంబనికి ఆర్థిక సహాయం
మృతుడి కుటుంబనికి మేఘాన్న ఆర్థిక సహాయం
రోడ్డు మరమత్తు సహకరించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రెడ్డి
సింగపూర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా భక్తిశ్రద్దలతో జరుపుకోవాలి...