ప్రజావాణికి 63 దరఖాస్తులు
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 21, న్యూస్ ఇండియా : జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి 63 మంది దరఖాస్తుదారులు తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు సమర్పించారు. రెవెన్యూ శాఖ 35 , పౌరసరఫరాల శాఖ 02, సర్వే ల్యాండ్ 4, పంచాయతీ & పి టి విభాగం 3, పంచాయతీరాజ్ 2, డి.ఆర్.డి.ఓ 4, మున్సిపల్ 3, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3, వ్యవసాయ శాఖ 4, పశు సంవర్ధక శాఖ 3, వచ్చాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… ప్రతి అర్జీపై తక్షణ చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజల ప్రధాన సమస్యలపై పూర్తి దృష్టి పెట్టి, పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీ.ఆర్.ఓ పద్మజ రాణి, ఏవో అంటోని సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comment List