తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత...

క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పుతం..

On
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత...

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు.

IMG-20250123-WA1023
కబడ్డీ క్రీడలను రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత...

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి...

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మెట్, జనవరి 23 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒక క్రీడాకారుడిగా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలియజేయడం జరిగింది. కబడ్డీ క్రీడా జాతీయ క్రీడ అని గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కబడ్డీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పుతున్నట్లు తెలియజేశారు. బాటసింగారం గ్రామంలో సమస్యలు లేకుండా చూస్తానని అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేస్తారని తెలియజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డి టాస్ వేసి కబడ్డీ క్రీడలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడ్డి గన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, చామ విజయ శేఖర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరా చారి, పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు, వైస్ చైర్మన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బుర్రరేఖ మహేందర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు బింగి దేవదాస్ గౌడ్, స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యులు కేశెట్టి వెంకటేష్, కొ ఆప్షన్స్ సభ్యులు గౌస్ పాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు మోడెపు గణేష్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్