ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

On
ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం సెప్టెంబర్ 12 (న్యూస్ ఇండియా ప్రతినిధి): మహేశ్వరం ప్రభుత్వా డిగ్రీ కళాశాలను అకస్మకంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంలో కళాశాలకు ఇటీవల బదిలీపై వచ్చిన అధ్యాపకులను విద్యార్థులను కలసి కళాశాలకు పూర్తిస్థాయి బోధన సిబ్బంది రావడం పట్ల వర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంగి రమేష్ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిని వివరిస్తూ అదనపు గదుల కొరతను, ఇతర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కళాశాలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను, లాబోరేటరీ, లైబ్రరీ, అదనపు గదులను కల్పిస్తామని అన్నారు. విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయండి అని సూచించారు. అనంతరం

IMG-20240912-WA1606
మహేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి..

కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చందన, డాక్టర్ ఫారూఖీ, శ్రీదేవి, డాక్టర్ జహీదా, డాక్టర్ శ్రీహరి రెడ్డి, డాక్టర్ దయానంద్, డాక్టర్ గోపాల్, డాక్టర్ ఫర్హాత్, నరసింహులు, నరేందర్ రెడ్డి, చేన్నోజి, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 21

About The Author

Post Comment

Comment List

Latest News