*జిరో బడ్జెట్ సినిమా'శరపంజరం'ఆదరించండి

సినిమా హీరో మరియు డైరెక్టర్ గట్టు నవీన్

*జిరో బడ్జెట్ సినిమా'శరపంజరం'ఆదరించండి

యదార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని నటించిన శరపంజరం సినిమా....
•రేపే తొర్రూరు రామకృష్ణ థియేటర్ లో విడుదల..
•తెలంగాణలో 60 దియేటర్ లలో రిలీజ్...

 

 శర పంజరం సినిమా జీరో బడ్జెట్ తో రూపొందిన సినిమా.ఈ సినిమా ప్రత్యేకత మన తెలంగాణ పల్లెల్లో ఏవిధమైన సంస్కృతి ఉంటుందో ప్రజలకు తెలియజేయుటకు ఈ సినిమా రూపొందించడం జరిగిందని సినిమా హీరో మరియు డైరెక్టర్ గట్టు నవీన్ అన్నారు.కావున ఈ శర పంజరం సినిమాను అందరూ ఆదరించి సినిమాను హిట్ కొట్టే విధంగా ప్రజలు ఆదరించాలని కోరారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో సినీ నటులు మాట్లాడుతూ... శరపంజరం సినిమా తెరకెక్కించడానికి మేమంతా ఎన్నో కష్టాలు పడి రూపొందించిన శరపంజనం సినిమా దేశంలోనే ఏకైక జీరో బడ్జెట్ సినిమా అని అన్నారు.ఈ శరపంజరం సినిమా దోస్తాన్‌ ఫిలింస్‌, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై టి.గణపతిరెడ్డి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌ లయ.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.నేడు విడుదల కబోతున్న శర పంజరం సినిమాలో వరంగల్‌ భాషన్న, ఆనంద్‌ భారతి, జబర్దస్త్‌ వెంకీ, జీవన్‌, రాజమౌళి, మిల్కీ, అలువాల సోమయ్య, మౌనశ్రీ మల్లిక్‌, మేరుగు మల్లేశం గౌడ్‌, కళ్యాణ్‌; మెజీషియన్‌ మానుకోట ప్రసాద్‌, కృష్ణవేణి, ఉదయశ్రీ, రజియ, ఉషా తదితరులు నటిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సినీ నటులు పాల్గొన్నారు.

Views: 157
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News