టీడీపీ పార్టీ బలోపేతంలో సోషల్‌ మీడియాదే కీలక పాత్ర...!

- సోషల్ మీడియా వేదికగా పనిచెసిన చురుకైనా వ్యక్తులకు ఘనంగా సన్మానం...

On
టీడీపీ పార్టీ బలోపేతంలో సోషల్‌ మీడియాదే కీలక పాత్ర...!

తలారీ ఆంజనేయులు మరి హుసేని లను సన్మానించిన నియోజకవర్గం టిడిపి ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి...

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం డిసెంబర్ 10:- టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ బలోపేతం కోసం చురుకుగా పనిచేసేందుకు సోషల్ మీడియా వేదికను ప్రవేశ పెట్టారు. సొషల్ మీడియా ద్వారా పార్టీ విజయంలో ఎవరికి ఎంత సమయం వీలైతే అంత సమయం సద్వినియోగపరిచి పార్టీని విజయ తీరాలకు చేర్చడంలో తమ వంతు పాత్ర పోషించాలని టీడీపీ ఆధిష్టానం  పేర్కొంది. కార్యకర్తలు పార్టీకి పనికొచ్చే విధంగానే పోస్టులు పెట్టాలని టీడీపీ సూచించింది. పార్టీ చేసిన మంచి పనులు, అభివృద్ధి, సంక్షేమం, పార్టీ నాయకత్వం యొక్క దూరదృష్టి, వారి విజయాలపైనే ఫోకస్ చేయాలని కోరింది. గతంలో వైసీపీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించిందని, దీన్ని గమనించిన టీడీపీ అధిష్టానం పెద్ద ఎత్తున పార్టీకి ప్రచారం చేసేలా సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుంది. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చాలావరకు ఈ వ్యవస్థ పనిచేసింది. ఇందులొ భాగంగానే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలొ టిడిపి పార్టీ కోసం గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా వేదికగా చురుకుగా టిడిపి పార్టీ బలోపేతానికి కష్టపడిన వ్యక్తులను గుర్తించి, టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు సోషల్ మిడియాలొ పనిచేసిన వారిని ఘనంగా సన్మాణించె కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దకడబూరు మండలానికి చెందిన టీడీపీ బిసి నాయకుడు తలారీ ఆంజనేయులు మరియు మేకడోనా గ్రామం హుసేని లను మంత్రాలయం నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి రాఘవేందర్ రెడ్డి ఆధ్వరంలో వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. పార్టీ కోసం పని చేయడంలో ఈ టీంలు కొంత వరకు సక్సెస్ అయినట్టే. అలాగే టీడీపీ పార్టీ బలోపేతం కోసం తమ వంతుగా కష్టపడిన విరికి టీడీపీ నేతలు భవిషత్ లో ఏదైనా పదవితో దారి చూపిస్తారో లేదో వేచి చూడాలి...IMG_20241211_071922

Views: 34
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్