కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

పాల్గొన్న జిల్లా ఎస్పి రోహిత్ రాజు

On
కొత్తగూడెం పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కార్యక్రమం

కొత్తగూడెం (న్యూస్ఇండియా నరేష్) అక్టోబర్ 28: కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్ నందు సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని, రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా కొత్తగూడెం IMG20241028110020 ప్రజల నుంచి విశేష స్పందన లభించింది అన్నారు. అక్టోబర్ 21 నుంచి పోలీసు అమరవీరుల సంస్కరణ దినం పురస్కరించుకొని సైకిల్ ర్యాలీ, ఓపెన్ హౌస్, రక్తదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడుకోగలుగుతామన్నారు. కొత్తగూడెంలో రక్తదానానికి సంబంధించి చాలా వాట్సాప్ గ్రూప్స్ ద్వారా రక్తదానాన్ని అందించడం చాలా సంతోషకరమన్నారు. రక్తదానం చేయడం వలన కొత్త రక్తం మన శరీరంలోకి వస్తుంది అన్నారు. దానివల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నారు. వారోత్సవాల సందర్భంగా కాకుండా తరచుగా రక్తదానం చేయడం మంచిదన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న తల సేమియా, సికిల్ సెల్, అనిమియా బాధపడుతున్న వారికి రక్తం అవసరం ఉన్నందున, రక్తదానం చేయండి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి ఎస్.కె అబ్దుల్ రెహమాన్, సిఐలు, ఎస్సైలు, రెడ్ క్రాస్ డాక్టర్ స్వామి, పోలీస్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Views: 71
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్