రెండు జెండా పండుగ ల్లో తేడా..

On
రెండు జెండా పండుగ ల్లో తేడా..

రెండు జెండా పండుగ ల్లో తేడా

IMG-20240815-WA1375
పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

కాసేపట్లో..త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తాం.
జణ గణ మన అధినాయక.. జయహే..
అని గొంతెత్తి,ముక్త కంఠంతో..
జాతీయ భావాన్ని, మన కంఠ శోష గా త్రి వర్ణం రెపరెప ల కు సమున్నత గౌరవం తో సెల్యూట్ ..సమర్పిస్తాం
ఈ పంద్రాగస్టు పండుగ నాడు చేసే జెండా వందనానికి, గణ తంత్ర దినోత్సవం నాడు చేసే జెండా వందనానికి సాంకేతికంగా తేడా లు ఉన్నాయని,ఆ విషయం తెలుసుకోవడానికి ఆసక్తి కరంగా ఉన్న పలు విషయాలు ..సామాజిక స్పృహ తో విధులు నిర్వర్తించే అధికారి పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ "న్యూస్ ఇండియా" తో పంచుకున్నారు.
ఆయన మాటల్లోనే..
పంద్రాగస్టు,రిపబ్లిక్ డే సందర్భంగా ఉన్న వ్యత్యాసాలు వాటి వివరాలు.

వీధి వీధి నా.. అధికార..అనధికార పౌరుల సమక్షం లో..గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుతాం.

తల ఎత్తి..నుదుట అరచేత్తో సలాం.. పెడతాం.ఓ మహోన్నత మువ్వన్నెల జెండాకు కు వందనం సగర్వంగా సమర్పిస్తాం.

Read More లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...

త్రివర్ణ పతాకం కు ..
జై హింద్
జై హింద్ అంటూ.. సమున్నత గౌరవ భావం తో..
జాతీయ గీతం ఆలకించి, ఆలపించి సెల్యూట్ చేస్తాం.
ఐతే..

Read More విజయానికి ప్రతీకగా విజయదశమి


స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేయడానికి, అలాగే జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..

Read More నూతన బస్సు సర్వీసు ప్రారంభం

ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.

ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. 

ఆ తేడా ఏమిటో  తెలుసా?!

ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
 *ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు*
బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు.* మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. 

గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.  జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా *త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు*. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.
 ( *గమనిక*:  ఇక్కడ  జనవరి 26 నాడు జెండాను అప్పటికే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము.)

దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.

 స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.
అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన  వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను *ఎగురవేస్తారు*(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను  *ఆవిష్కరిస్తారు*(Flag Unfurling) . ఇంకొక వ్యత్యాసం  ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం *ఎర్రకోటలో* జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26  నాడు *రాజ్‌పథ్‌లో* జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(కొంత మందికి సైతం తెలిసి ఉండకపోవచ్చు). జెండా పండుగ పై అవగాహన  కల్పించడం మన బాధ్యత. ముఖ్యంగా విద్యార్దులకు తెలియాలి , తెనియజేయాలి

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News

కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కొరవి మండలంలో స్కూలు, హాస్టల్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
    మంగళవారం *జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్* కురవి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ , ఆశ్రమ హై స్కూల్ , ప్రాథమిక
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు
తొర్రూరులోని జ్యోతిరావు పూలే పాఠశాల కు అద్దె చెల్లించట్లేదని పాఠశాలకు తాళం
హరియాణాలో కాంగ్రెస్ ఓటమికి
కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ
లక్కునోడికే లక్కీ ఛాన్స్...! పెద్దకడబూరు వైన్ షాప్ లాటరీలో లక్కునోళ్ళు ఎవరో తెలుసా...
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి