పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి

పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి లబ్బిదారులకు అందచేసారు.పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అనారోగ్యానికి గురైన వివిధ గ్రామాలకు చెందిన 51 మంది బాధితులకు మంజురైన 11 లక్షల 81 వేల ఐదు వందల రూపాయలు (11,81,500) రూ. చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి లబ్బిదారులకు అందచేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతు ఆరోగ్య శ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య శ్రీ పథకం వర్తించని వ్యాధులకు, పేదలను ఆదుకోవడం కోసం సిఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్ని రెడ్డి అన్నారు.ప్రజా సంక్షేమం కోసం.. ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు.దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రములో ప్రజల కోసం పథకాలను రూపకల్పన చేసిన సిఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి అన్నారు.సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి కి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు హమ్యా నాయక్, రాపాక సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సోమా రాజశేఖర్, మండల అధ్యక్షులు సుంచు సంతోష్, రవీందర్ రెడ్డి, సురేష్ నాయక్, గిరగాని కుమారస్వామి, ముద్దసాని సురేష్, నల్ల శ్రీరామ్, పట్టణ వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు, పాల్గొన్నారు..

Views: 42
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్