దీపావళి పండుగ 

దీపం ఐశ్వర్యం

On
దీపావళి పండుగ 

దీపావళి పండుగ 
దీపం ఐశ్వర్యం అని.. అంధకారం దరిద్రం అని.. దీపమున్నచోట జ్ఞాన సంపద ఉంటుందని దీపము సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీపావళిరోజు లక్ష్మీ దేవికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే.. సకల సంపదలు కలుగుతాయని పురాణాలు తెలిపాయి. సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం అనేది ఒక సంప్రదాయం. దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులగా చెప్తుంది శాస్త్రము.

దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా.. నీలకాంతి విష్ణు భగవానునిగా.. తెల్లని కాంతి పరమశివునికి ప్రతినిధులుగా చెపుతారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రము రోజును దీపావళిగా చెప్తారు. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దీపావళికి సంబంధించి పురాణాల ప్రకారం నాలుగు కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.

శ్రీరామ చంద్రుడు.. సీతా దేవి
రావణాసురునితో జరిగిన యుద్ధంలో విజయము సాధించిన శ్రీరామచంద్రుడు.. సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు. ఆరోజు ఆశ్వయుజ మాసం, అమావాస్య అని రామాయణం చెప్తుంది. ఆరోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి.

నరకాసురుని సంహరణ
నరకాసురుని సంహరించిన తరువాత.. నరకాసురుని పీడ వదిలిపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఆ పరంపర నేటికి జరుగుతున్నదని పురాణాలు చెప్తున్నాయి.

Read More సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...


లక్ష్మీదేవి ఉద్భవించినరోజు..
దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రమును చిలుకుతుండగా.. లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆరోజును దీపావళిగా చెప్తారు. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని.. దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషంగా భావిస్తారు.

Read More మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

అజ్ఞాతవాసం తర్వాత
మహాభారతంలో కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు. అలా పాండవులు తిరిగివచ్చిన రోజున దీపావళి పండుగగా చేస్తారు

Read More క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 

అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు

గుండెపుడి చైతన్య శర్మ 
ఫోన్ నెంబర్ 960 387 1143

Views: 99
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్