ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్...
On
ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్...
రంగారెడ్డి జిల్లా, జనవరి 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడం జరిగినది. రంగారెడ్డి జిల్లాలో 12 మున్సిపాలిటీలకు, మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగినది. ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్ పేట్, షాద్ నగర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీలకు, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లకు జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ప్రతిమా సింగ్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
Views: 1
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 10:19:04
- బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు- ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.
Comment List