గణతంత్ర దినోత్సవం అంటే భిన్నత్వంలో ఏకత్వం...

పెద్దకడుబూరు మండలంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.

On
గణతంత్ర దినోత్సవం అంటే భిన్నత్వంలో ఏకత్వం...

స్వాతంత్ర్యయోధ్యమా వీరుల అడుగుజాడల్లో మనమందరం నడవాలి - తహసీల్దార్ శ్రీనాథ్...

న్యూస్ ఇండియా/ పెద్దకడుబూరు మండలం జనవరి 26 :- మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని స్థానిక తహసీల్దారు కార్యాలయం నందు తహసీల్దార్ శ్రీనాథ్ అద్వర్యంలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా స్వాతంత్ర్య అమరవీరులకు మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అర్ అంబేద్కర్ గారికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. అలాగే మూడు రంగుల మువ్వెన్నెల మన భారతదేశ జాతీయ జండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. అలాగే భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని ఆనాడు మన స్వాతంత్ర్య అమర వీరులు నిర్ణయించడం జరిగిందన్నారు. అలాగే మన భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినంగా మనందరం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే స్వాతంత్ర్య దినంను ఆనాటి పలువురు అమరవీరులు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తో పాటు తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ గణతంత్ర దినోత్సవం రోజున మనమందరం కలిసి స్వాతంత్ర్యయోధ్యమా విరులనందరిని కచ్చితంగా స్మరించుకోవాలని, వారి అడుగుజాడల్లో మనం అందరూ కలిసి నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది , పోలిస్ శాఖ సిబ్బంది, మరియు తదితర మండల పెద్దలు పాల్గొనడం జరిగింది...IMG-20250126-WA0261

Views: 29
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..! మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
- బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు- ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...