విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో  పాడి గేదలు మృతి 

ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ మరియు విద్యుత్ అధికారులు

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో  పాడి గేదలు మృతి 

కిందిస్థాయి ఉద్యోగులచే మొత్తం పనులు చేయిస్తూ బయట వ్యవహారాలు చూసుకుంటున్న జూనియర్ లైన్మెన్లు, లైన్మెన్లు , లైన్ ఇన్స్పెక్టర్.


విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పాడే గేదలు మృతి చెందిన సంఘటన నాంచారి మడూరు గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలో బంగారి సోమయ్య అనే రైతు పాడి గేదెలు ఉదయాన్నే మేత కోసం వదిలేసిన క్రమంలో కొద్దిసేపట్లోనే కరెంటు ఎన్టీ లైన్ వైరు తెగి పొలాలలో పడినది అది గమనించని రైతు పాడి గేదెలు మేతకై వెళ్లి వైర్లను తాకి వెంటనే మృతి చెందాయి. అవే జీవనాధారంగా బ్రతుకుతున్న రైతు బోరున విలపించాడు తాను జీవనాధారం అయినటువంటి గేదెలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు నా గేదెలు మృతి చెందాయని నడి పొలంలో కరెంటు స్తంభం జెసిబి తాకి వంగి పోతే దాన్ని రిపేరు చేయమని ఎన్నోసార్లు  మొరపెట్టుకున్నా కూడా సంవత్సరం గడుస్తున్న లైన్ రిపేరు చేయకుండా కాలం వెళ్లపుచ్చుకుంటూ వచ్చినారు. ఈరోజు మడూరు గ్రామంలో దుర్గమ్మ పండుగ సందర్భంగా ఎంతోమంది గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చి ఉన్నారు పొరపాటున ఎవరైనా అటు వెళ్లిన నా గేదెలకు పట్టిన పరిస్థితి పట్టును కదా అని ఆవేదన చెందాడు ఇంత జరుగుతున్నా ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా లైన్మెన్ గాని లైన్ ఇన్స్పెక్టర్ గాని ఏఈ గాని తమకు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని రైతు ఆవేదన చెందాడు 
నాకు జీవనాధారం అయినటువంటి గేదెలు మృతి చెందడంతో నా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది గేదపాలు అమ్ముకొని బ్రతికే మాకు  జరిగిన నష్టానికి న్యాయం చేయగలరని పై అధికారులను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము..

Views: 64
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...