తెలంగాణ రాష్ట్రంలో మొదటి అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే

రెండో అతి పెద్ద జాతర ఎక్కడ తెలుసా..?

On
తెలంగాణ రాష్ట్రంలో మొదటి అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే

న్యూస్ ఇండియా తెలుగు,  ఫిబ్రవరి 17 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) పెద్దగట్టు జాతర,  తెలంగాణ రాష్ట్రంలో  జరిగే రెండవ పెద్ద జాతర.ఇక్కడికి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలలోనుండే కాక పొరుగున వున్న  చతిస్గడ్ ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర రెండేళ్ళ కొక సారి అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది .peddagutta-jatara-1

 ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని.. ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మిక. దురజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో ఏడెనిమిది కొండగుట్టలున్న అటవీప్రాంతం ఉంది. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట.  


దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర. లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల కుట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలు పట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఒలింగా... ఓ లింగా ........ అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చే గొర్రెపొటేల్‌ను తీసుకొస్తారు . ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటేల్‌కు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవులకు పూజచేస్తారు.  

లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం (శాకాహారం) సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా.. భక్తజన లింగనాదాల మధ్య ప్రారంభమవుతా యి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాక.. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. 

Read More బిఆర్ఎస్ కు భారీ షాక్ తప్పదా.......?

peddagattu-jatara-1-1551232117

Read More పిహెచ్సి ని తనకి చేసిన డిఎంహెచ్ఓ

ఇది ఐదు రోజుల పండుగ. శనివారం మధ్యాహ్నం మూలవిరాట్‌లకు అలంకరణ మొదలయింది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరించారు.         

Read More కవన తీగ పుస్తకావిష్కరణ

జాతర జరిగే తొలిరోజు భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకున్నారు. రెండోరోజు. యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేయగా.. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పిస్తారు. మిగతా దేవతలకు జంతుబలులు సమర్పిస్తారు. మూడో రోజున చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. నాలుగో రోజు నెలవారం. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి అక్కడ నిలుపుతారు. దానిని తర్వాత వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు... మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. ఇలా ఐదు రోజుల పాటు ఈ జాతర మహా వైభోగంగా జరుగుతుంది.

peddagattujathara

Views: 105

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
  మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ
తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్
సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి
మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....  బిజెపి పాలన రాక్షస పాలన....