లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు..! సిఐ కిరణ్ కుమార్, ఎస్సై సిరిసిల్ల అశోక్..
రుద్రంగి, ఫిబ్రవరి16, న్యూస్ ఇండియా ప్రతినిధి
వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలను నపడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని చందుర్తి సిఐ కిరణ్ కుమార్, రుద్రంగి ఎస్సై సిరిసిల్ల అశోక్ అన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు స్థానిక రుద్రంగి పోలీస్ స్టేషన్లో శుక్రవారం డ్రైవింగ్ లైసెన్స్ మేళా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ... డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లే చేసిన వారికి పలు సూచనలు సూచించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ఇన్సూరెన్స్ వంటివి లబ్ది పొందవచ్చని అన్నారు.లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు.
మైనర్లకు వాహనం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇవ్వకూడదాని ఇస్తే ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమనిపై కేసు వేయబడుతుందని అన్నారు. అనంతరం ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ మేళా ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని హెచ్చరించారు.
Comment List