పివిక్ -5ఇంక్లైన్ లో ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్

On
పివిక్ -5ఇంక్లైన్ లో ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్

  పివిక్ -5ఇంక్లైన్ లో ఐఎన్టీయూసీ గేట్ మీటింగ్IMG-20231222-WA0065

సింగరేణి పరిరక్షణ కోసం కార్మికుల హక్కుల కోసం గడియారం గుర్తుకు ఓటెయ్యండి  :  వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్

ఐఎన్టీయూసీ లోకి   భారీగా కార్మికుల చేరిక

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐఎన్టియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్ నాయక్

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా  బ్యూరో నరేష్ )డిసెంబర్ 21:ఆగమవుతున్నటువంటి సింగరేణి నీ రక్షించడం కోసం,   అణిచి వేయబడుతున్నటువంటి కార్మికుల హక్కుల కోసం, కార్మికుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం  ఐఎన్టియుసి గడియారం గుర్తుకి ఓటు వేయగలరని  ఐఎన్టియుసి పివికే-5 గని వద్ద  బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఆధ్వర్యంలో   మీటింగ్ నిర్వహించరు . ఈ  మీటింగ్ లో  ఐ ఎన్ టి యు సి   విధివిధానాలకు ఆకర్షితులై  అధిక సంఖ్యలో కార్మికులు  ఐఎన్టీయూసీ లో చేరారు. ఈ యొక్క సమావేశంలో  ముఖ్య అతిథులుగా   ఐఎన్టీయూసీ  సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శంకర్ నాయక్   పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ  అనేది తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిదని  అటువంటి సింగరేణి సంస్థను ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి  గత రాష్ట్ర ప్రభుత్వ మరియు పాలకులు  సింగరేణి నిర్వీర్యం చేసే అనేక కుట్రలు చేశారని  దానివలన ఈ ప్రాంతం మరియు కార్మికులు తీవ్రత తీవ్రంగా నష్టపోవడం జరిగిందనరు .  సింగరేణి చరిత్రలో కార్మికుల మీద ఎన్నడూ లేనటువంటి  రాజకీయ నిర్బంధ పరిస్థితులు ఇప్పటివరకు కొనసాగాయని  వాటిని బద్దలు  కొట్టాల్సినటువంటి అవసరం ఉందని  వారు మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే అండర్ గ్రౌండ్ మైన్ లు ఓపెన్ చేస్తామని ఇప్పటివరకు ఒక్కటంటే ఒకటి ఓపెన్ చేసిన పాపాన పోలేదని అంతేకాక  సింగరేణి పూర్తిస్థాయి ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తున్నారని వారు మాట్లాడారు ఈసారి   ఐఎన్టీయూసీ కి అవకాశం ఇవ్వాలని కోరారు.కార్మికుల భవిష్యత్ కోసం  సింగరేణి ప్రాంత అభివృద్ధి కోసం  ఐఎన్టియుసి ఆధ్వర్యంలో సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం, సింగరేణి కార్మికులందరికి సొంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలం 20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తాం,అని పెర్క్స్ మీద ఇన్ కమ్ టాక్స్ యాజమాన్యం చే కట్టిస్తాం,కారుణ్య నియామకాలను సులభతరం చేస్తాం, సింగరేణి ప్రతి ఏరియాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం అని వారు హామీ ఇచ్చారు.కావున కార్మికులందరూ సింగరేణి యొక్క రక్షణ మరియు  భవిష్యత్తు కోసం ఐఎన్టీయూసీ యొక్క గడియారం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జీకే ఓ సి బ్రాంచ్ సెక్రటరీ రాజేశ్వరరావు, పీవీక్ ఫిట్ సెక్రటరీ రిషి , పీవీక్ నాయకులు శంకర్ , పీవీక్ బ్రాంచ్ సెక్రటరీ  వై. సైమన్, మురళి, బాలు.మరియు తదితరులు పాల్గొన్నారు. 
Views: 43
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై నాటక ప్రదర్శన
భారతదేశ భవిష్యత్తు యువత పైన ఉందని యువత మాదకద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని,   మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని సమాజ స్థాపనకు కృషి...
క్విట్ స్మోకింగ్.. క్విట్ టుబాకొ.. 
మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్