ఏపీలో అందోళనకరంగా ధియేటర్ల పరిస్థితి

On

ఎక్కడైనా ఉన్నవాటికి పోటీగా కొత్తవి పుట్టుకొస్తాయి. మార్కెట్ కాంపిటిషన్‌లో పోటీపడి నిలదొక్కుకుంటాయి. ఏపీలో ఇప్పుడు సినిమా పరిశ్రమ దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్త ధియేటర్ల మాట అటుంచితే.. ఉన్నవాటినే నడపలేక మూసేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాలు ప్రదర్శించాలంటే ఎదురు తమ జేబుకే చిల్లు పడుతుందనేది యాజమాన్యాల మాట. అఖండ, పుష్ప, శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సినిమాల రిలీజ్‌తో మార్కెట్‌కి హౌస్‌ఫుల్‌ టాక్ వచ్చినా కూడా తాము ధియేటర్లు నడపలేమని వారంటున్నారు. తాజాగా ఆసియాలోనే 2వ అతిపెద్ద ధియేటరైన […]

ఎక్కడైనా ఉన్నవాటికి పోటీగా కొత్తవి పుట్టుకొస్తాయి. మార్కెట్ కాంపిటిషన్‌లో పోటీపడి నిలదొక్కుకుంటాయి. ఏపీలో ఇప్పుడు సినిమా పరిశ్రమ దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్త ధియేటర్ల మాట అటుంచితే.. ఉన్నవాటినే నడపలేక మూసేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాలు ప్రదర్శించాలంటే ఎదురు తమ జేబుకే చిల్లు పడుతుందనేది యాజమాన్యాల మాట.

అఖండ, పుష్ప, శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సినిమాల రిలీజ్‌తో మార్కెట్‌కి హౌస్‌ఫుల్‌ టాక్ వచ్చినా కూడా తాము ధియేటర్లు నడపలేమని వారంటున్నారు. తాజాగా ఆసియాలోనే 2వ అతిపెద్ద ధియేటరైన V-ఎపిక్ కూడా మూతపడింది. ఇప్పటికి ఇలా మూతపడిన ధియేటర్ల సంఖ్య 125కి చేరింది. చూస్తుంటే ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదనే ఆందోళన కూడా ఉంది.

తెలంగాణలో పోలిస్తే ఏపీలో ధియేటర్లు చాలా ఎక్కువ. దాదాపు వెయ్యి ధియేటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవన్నీ ఇప్పుడు క్లోజ్ చేసేసి కల్యాణ మండపాలుగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...