బైక్ దొంగ అరెస్ట్

8 బైకులు స్వాధీనం చేసుకున్న వన్ టౌన్ పోలీసులు

On
బైక్ దొంగ అరెస్ట్

వివరాలు వెల్లడించిన సిఐ కరుణాకర్

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)డిసెంబర్‌4: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బైకుల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని వన్‌ టౌన్‌  పోలీసులు అరెస్టు చేసినట్లు సిఐ ఎం.కరుణాకర్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిఐ వెల్లడిస్తూ..IMG-20241204-WA1420 ఈజీ మనికి అలవాటు పడిన భద్రాచలం పట్టణానికి చెందిన గుమ్మడి రాజు గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయిస్తూ వచ్చిన డబ్బుతో జల్సా జీవితాన్ని గడుపుతున్నాడు. మంగళవారం రాత్రి కోతగూడెం బస్టాండ్‌ సెంటర్‌లో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా రాజు ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది.అతన్ని పోలీసులు ప్రశ్నించగా పొందలేని సమాధానం చెప్పడంతో అతని అదుపులోకి తీసుకొని విచారించారు. ఇటీవల కాలంలో ఖమ్మంలో 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు అంగీకరించాడు. రాజును పోలీసులు అరెస్టు చేసి ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ స్పష్టం చేశారు. దొంగను అదుపులోకి తీసుకోవడంలో కృషిచేసిన సిఐ కరుణాకర్‌, కానిస్టేబుల్‌, శంకర్‌ ,సురేష్‌ నరేష్‌లను డిఎస్పి అబ్దుల్‌ రెహమాన్ ప్రత్యేకంగా అభినందించారు.

Views: 170
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా బీఎస్పీ పార్టీకి యెర్రా కామేష్ రాజీనామా
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా) ఫిబ్రవరి 4:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి మరియు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు యెర్రా కామేష్ మంగళవారం మీడియాకు విడుదల...
ధూమపానం విడితే..క్యాన్సర్ పరార్..
కల్మషం లేని సేవకుడు - కష్టం తీర్చే నాయకుడు
ఉత్తమ పరిశోదన ఆవార్డు..
అభినందన సంచిక గురు సత్కారం
ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం.. క్విట్ టుబాకో బీ ఏ హీరో...
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం