ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు

మాన్యపు భుజేoదర్ కు ఆహ్వానం

By Venkat
On
ప్రపంచ తెలుగు సాహితీ కళా జాతరకు

మాన్యపు భుజేoదర్

అక్టోబర్ 19 /20 -2024తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ లోని తాడేపల్లిగూడెంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 24 గంటలు ఏకధాటిగా జరిగే సాహిత్య కళాజాతరకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన శ్రీ పోతన సాహిత్య కళావేదిక అధ్యక్షుడు మాన్యపు భుజేoదర్ కు ఆహ్వానం అందినట్లు బుజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా భుజేందర్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సాహిత్య కళాజాతరకు ఆహ్వానం అందినందుకు చాలా సంతోషంగా ఉన్నదని అట్లాగే జనగామ జిల్లాలోని కవులు కళాకారులు సాహిత్య అభిమానులు మాన్యపు భుజేoదర్ ను అభినందించినట్లు తెలిపారు. అంతర్జాతీయ సాహిత్య కళావేదిక శ్రీశ్రీ కళావేదిక ప్రపంచంలో చాలా పెద్ద సాహిత్య సంస్థని ఎందరో కవులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న శ్రీ శ్రీ కళావేదిక నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.IMG-20241015-WA0249

Views: 9
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News