చిన్నతుంబళం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ....!

చిన్నతుంబళంలో దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు.

On
చిన్నతుంబళం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ....!

- ఘటనలో 14 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 30 :- పెద్దకడుబూరు మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సోమవారం ఉదయం బోయ తాయన్న అతని కొడుకు బోయ నాయుడు తో పాటు వారి కుటుంబ సభ్యులు కొందరు కలిసి అదే గ్రామానికి చెందిన కమ్మరి వీరేష్, గంగాదర్ మరియు అతని తండ్రి బుడ్డప్ప ను కట్టెల తో కొట్టి కిందపడేసి కాళ్లతోను చేతులతోను కొట్టి దాడి చేసి రక్త గాయాలు చేశారాని దాడికి గురైన కమ్మరి వీరేష్ సోమవారం మండలంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ దాడి ఘటనపై ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి బోయ తాయన్న కొడుకు బోయ నాయుడు అదే గ్రామానికి చెందిన కామవరం గంగాధర్ కు ఆటోను తగిలించడంతో ఇరు వర్గాల కుటుంబాల మధ్య వాదులాటతో గొడవలు చేసుకున్నారని తెలిపారు. అక్కడితో ఆగకుండా సోమవారం ఉదయం బోయ తాయన్న అతని కొడుకు బోయ నాయుడు తో పాటు వారి కుటుంబ సభ్యులు 14మంది కలిసి గంగాదర్, అతని తండ్రి బుడ్డప్ప మరియు వీరికి సపోర్ట్ గా ఉన్నాడని కమ్మరి వీరేష్ ను కట్టెలతో కొట్టి రక్త గాయాలు చేసి బెదిరించారని, అలాగే గంగాదర్ బంధువైన రమేష్ యొక్క ఇంటి తలుపులు పగలగొట్టారని దాడికి గురైన కమ్మరి వీరేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ దాడి ఘటనపై విచారణలో దాడికి పాల్పడిన మొత్తం 14మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్వెఐ ల్లడించారు. దాడి ఘటనలో గాయాలైన వ్యక్తులను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

Views: 5
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...