పొంగులేటి పై ఈడి దాడులు బిజెపి బిఆర్ఎస్ లోపాయి కార ఒప్పందమే

ఈడీలతో కాంగ్రెస్ ను భయపెట్టలేరు

On

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

IMG20240928163259కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) సెప్టెంబర్ 28: ఈడీలతో కాంగ్రెస్ ను భయపెట్టలేరని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగడ్డ లోని వారి  నివాసంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాందాస్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై బిజెపి బిఆర్ఎస్ లోపాయి కారి ఒప్పందముతో జరిగిన ఈడి దాడులు రాజకీయ కక్ష సాధింపు అని అన్నారు. మంచి రాజకీయ భవిష్యత్తు , ప్రజల నాయకుడైన పొంగులేటి ఆదరణను ఓర్వలేకనే ఈడి దాడులు జరుగుతున్నాయి అన్నారు. పొంగులేటి కుమారుడు మరియు బంధువుల ఇండ్లపై 16 చోట్ల ఏకకాలంలో దాడు జరిపారని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. మోడీ గ్రాఫ్ పడిపోయిందని, రాబోయే రోజుల్లో కచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ చంద్రశేఖర రావు , కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, తూము చౌదరి, కూచిపూడి జగన్, మాలోత్ కృష్ణ, అర్జున్ రావు, వెంకటరెడ్డి, ధర్మారావు, బలరాం, అరుణ్, పూణెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

.

 

Views: 508
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి...
సాయి..సిపిఎస్ రద్దు చేయి స్వామి... భాగస్యామ్య పింఛను పథకం రద్దు కోసం సాయి కి ప్రత్యేక పూజలు... ఎన్.ఓ.పి.ఆర్.యూ.ఎఫ్ తెలంగాణ అధ్యక్షులుమాచన రఘునందన్.. భాగస్యామ్య పింఛను పథకం...
గౌతమ్ మోడల్ స్కూల్(GMS) ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ విధానం వల్ల మాలలకు తీవ్ర అన్యాయం..
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ...