పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..
పేద ప్రజలకు అండగా మానకోడూరు ఎమ్మెల్యే
పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం
ఇబ్రహీంపట్నం, జులై 21 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్ లో మానకోడూరు ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ కు పలువురు వైద్యులు ప్రజాప్రతినిధులు ఘనంగా శాలువా, ఘజమాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 30 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉంటూ ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా సేవలందిస్తూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో, అటు కరీంనగర్ జిల్లా మానకోడూరు ప్రాంతంలో ఉత్తమ వైద్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచారని, అదేవిధంగా రాజకీయంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమంది పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని లయన్ కె.వి. రమేష్ తెలిపారు. భవిష్యత్తులో శాసనసభ్యులు డాక్టర్. సత్యనారాయణ మరింత ఉన్నతమైన స్థానంలో ఉండి పేద ప్రజలకు సేవలు అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సీనియర్ వైద్య నిపుణులు డా. అనురాధ మున్సిపల్ చైర్మన్న్లు కప్పరి స్రవంతి, మర్రి నిరంజన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ బర్ల మంగమ్మ జగదీష్ నాయకులు కంబాలపల్లి గురునాథ్ రెద్ధి, కృపేష్, ఇందిరాల రమేష్, కోడూరి రమేష్, ఈగల రాములు, తాళ్ల మహేష్ గౌడ్, కొండ్రు ప్రవీణ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు
Comment List