రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చేర్మెన్ గా మానాల మోహన్ రెడ్డి

On
రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చేర్మెన్ గా మానాల మోహన్ రెడ్డి

రుద్రంగి, మార్చి17, న్యూస్ ఇండియా కోక్కుల వంశీ ప్రతినిధి

రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రస్తుత రాజన్న సిరిసిల్ల  జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా 37 మంది కార్పొరేషన్ చైర్మన్ లను ప్రభుత్వం నియమించగా మానాల మోహన్ రెడ్డి కి ఆ జాబితాలో చోటుదక్కింది.

FB_IMG_1710688472304

సీఎం రేవంత్ రెడ్డికి అనుచరిడిగా ఉన్న మానాల మోహన్ రెడ్డి జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంతో పాటు పలు ఎన్నికలకు ఇంచార్జి గా పనిచేశారు. ఊరు పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న మానాల మోహన్ రెడ్డి ఆయన రాజకీయా ప్రస్థానం మొట్టమొదటి సరిగా కోనసముందర్ సొసైటీ డైరెక్టర్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, కోనసముందర్  సొసైటీ కి రెండు సార్లు చేర్మెన్ గా, రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి గా, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు పోషిస్తూ చెరగని ముద్ర వేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీలో ఉన్నప్పటికీ టికెట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించింది.

Read More రేవంత్ రెడ్డి పోరాట ఫలితంతోనే  బీఆర్ఎస్ పదేళ్ల దుర్మార్గ పాలన అంతం..

Views: 77
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి
*👉కాంగ్రెస్ చెప్పే మాటలేమో ఆకాశంలో చేతలేమో పాతాళంలో* *👉కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి!* *👉సమిష్టిగా కృషి చేస్తే వరంగల్ పార్లమెంట్ మనదే..ఉద్యమకారుడు మారేపల్లి...
కాంగ్రెస్ అహంకారాన్ని ఎంపీ ఎన్నికల ద్వారా దెబ్బ కొట్టాలి
ఇంటర్ లో పేయిల్ అయ్యానని మనస్థాపనతో విద్యార్థిని ఆత్మహత్య
గుడుంబా స్థావరాలపై విస్తృతస్థాయి దాడులు
అట్టహాసంగా తాటిపర్తి నామినేషన్ కార్యక్రమం
గుడుంబా స్థావరాలపై దాడులు
గుడుంబా స్థావరాలపై దాడులు