విజయవంతంగా జెన్ఫోల్డ్ సంబరాలు
జెన్ఫోల్డ్ రెండవ వార్షికోత్సవం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లో గల ఏసియాలోనే అత్యంత పరిశ్రమలు కలిగిన పేరుగాంచిన 'ఐల' లో జెన్ఫోల్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. జెన్ఫోల్డ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాత్రి జెన్ఫోల్డ్ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జెన్ఫోల్డ్ కో-ఫౌండర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్ర గుణపాటి మరియు డైరెక్టర్ అరుణ్ దూబే హాజరయ్యారు. తమ ఉద్యోగులు నిర్వహించిన కార్యక్రమాన్ని వీక్షించి హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యకమానికి యాంకర్ గా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ మలిగే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జెన్ఫోల్డ్ కో-ఫౌండర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్ చంద్ర గుణపాటి మరియు డైరెక్టర్ అరుణ్ దూబే మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మాకు చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసిన జెన్ఫోల్డ్ హెచ్.ఆర్ మేనేజర్ శ్రావణ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ మలిగే మరియు సేఫ్టీ డిపార్ట్మెంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగ గోపి లను అభినందించారు. జెన్ఫోల్డ్ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆట పోటీలలో గెలుపొందిన విజేతలకు మరియు రన్నెరప్ లకు శరత్ చంద్ర గుణపాఠి మరియు అరుణ్ దూబే లు బహుమతులు అందజేశారు.
Comment List