BRS అభ్యర్థి పువ్వాడ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం.

On
BRS అభ్యర్థి పువ్వాడ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం.

కాంగ్రెస్ లోకి పోలేదు.. BRS లోనే కొనసాగుతాం..*

*▪️BRS అభ్యర్థి పువ్వాడ గెలుపే లక్ష్యంగా పని చేస్తాం.*

*▪️మంత్రి పువ్వాడ సమక్షంలో BRS కండువా కప్పుకున్న మాజీ కార్పొరేటర్ లక్ష్మీ సుజాత రవి కాంత్.*

కాంగ్రెస్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు మా ప్రమేయం లేకుండా బలవంతంగా కాంగ్రెస్ కండువా కప్పి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హేయమైన చర్య అని మాజీ కార్పొరేటర్ ఉట్కురి లక్ష్మీ సుజాత రవికాంత్ ద్వజమెత్తారు.

ఖమ్మం నగరం డివిజన్ లో జరిగిన సమావేశం వద్దకు వచ్చి  మంత్రి పువ్వాడ సమక్షంలో BRS కండువా కప్పుకున్నారు..
 
ఈ సందర్భంగా వారు మాట్లాడారు.. ఈరోజు సాయంత్రం మా అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి తమ వెంట తెచ్చుకున్న కండువాలు మెడలో వేసి  ఫోటోలు తీయడం సిగ్గుచేటన్నారు.

Read More PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం

కనీసం మా అనుమతి కూడా అడగకుండా ఇలా దౌర్జన్యంగా పార్టీలోకి బలవంతంగా ఎందుకు తీసుకోవడం అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read More . పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..

తాము పార్టీలోని కొనసాగుతున్నామని స్పష్టంగా చెప్పినప్పటికీ బలవంతం చేరుకోవడం పెద్ద మనిషి హోదాలో ఉన్న తుమ్మల నాగేశ్వర రావు ఇలా చేయడం పద్దతి కాదని హితవు పలికారు. 

Read More రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

మేము BRS పార్టీలో గౌరవంగా కొనసాగుతున్నామని, రానున్న ఎన్నికల్లో BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గారి గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఇక ముందు కూడా చేస్తామని స్పష్టం చేశారు. 

దయచేసి తప్పుడు ధోరణిలో మా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇలాంటి బలవంతపు చేరికలు చేయొద్దు అని సూచిస్తున్నామని చెప్పారు.

పువ్వాడ అజయ్ కుమార్ గారి గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేసి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

Views: 44
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News