కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి

జిల్లా ఎస్పీకి సేవాలాల్ సేన వినతిపత్రం

On
కానిస్టేబుల్ సాగర్ కుటుంబానికి న్యాయం చేయండి

కొత్తగూడెం (న్యూస్ ఇండియా) అక్టోబర్ 14: సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారంIMG-20241014-WA0787 జిల్లా ఎస్పీ  రోహిత్ రాజుకు వినతి పత్రం ఇచ్చారు. భూక్యా సాగర్ నాయక్ మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, భూక్యా సాగర్ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, సాగర్ నాయక్ భార్యకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని, వారి పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ఏదైతే భూక్య సాగర్ నాయక్ తన వాంగ్మూలంలో ప్రస్తావించిన పేర్లను పరిగణలోకి తీసుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, పీడీ యాక్ట్ కేసు పెట్టి వారిని కఠినంగా శిక్షించాలని సేవలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ధరావత్ ప్రేమ్చంద్ నాయక్ డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, సేవాలాల్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు శీను నాయక్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు భూక్యా రవి రాథోడ్, రాష్ట కార్యదర్శి భూక్యా శీను నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ రమేష్ నాయక్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు బోడ బాలు నాయక్, ఇల్లందు మండల అధ్యక్షుడు వాంకుడు రమేష్ నాయక్, బూర్గంపాడు మండల అధ్యక్షులు సపవట్ సీతారాం నాయక్, బూర్గంపాడు ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, రైతుసేన అధ్యక్షులు బద్రు నాయక్, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేష్ నాయక్, పాల్వంచ మండల అధ్యక్షులు ధరం సోత్ పవన్ కళ్యాణ్ నాయక్, జూలూరుపాడు మండలాధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Views: 219
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News