గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుదాం

సర్పంచ్‌ గడ్డపు మనోహర్

On
గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుదాం

గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచు దామని సర్పంచ్‌ గడ్డపు మనోహర్IMG_20230929_192656 అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గం మండల కేంద్రమైన తడ్కల్ లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం పై శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.సర్పంచ్‌ గడ్డపు మనోహర్ మాట్లాడుతూ ఎక్కడ చెత్త అక్కడ వేయవద్దని సూచించారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి అంతా కంకణం కట్టుకోవాలన్నారు.హైస్కూల్‌ ప్రాంతంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.పంచాయతీ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Views: 48
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News