శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కొలువుదీరిన మహా గణనాధుడు
విగ్రహ దాత భూసాని సురేష్ దంపతులు.......
సంఘ గౌరవ అధ్యక్షుడు భోవనగిరి శంకర్
గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తుళ్లూరు పట్టణ కేంద్రంలోని చింతలపల్లి రోడ్డు లోని శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడు కొలువు తీయడం జరిగింది సంఘ సభ్యులు అందరూ సమక్షంలో గణనాథునికి మొదటి పూజ జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం గౌరవాధ్యక్షులు భోవనగిరి శంకర్ మాట్లాడుతూ సంఘం స్థాపించి పది సంవత్సరాలు అవుతున్న గ్రామంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు మహా వైభవ వేదంగా సంఘ సభ్యులు అందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుందని ఇందుకు సంఘ సభ్యులు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని కొనియాడారు ఆ గణనాథుడు సంఘ సభ్యులందరికీ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అన్నారు
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు భూసాని సురేష్,సెక్రటరీ దుసా ప్రభాకర్. ట్రెజరర్ తన్నీరు రామ్మూర్తి. వినాయక మండలి ..అధ్యక్షుడు యెళ్లు మహేందర్ రెడ్డి.సెక్రటరీ ఆకుల పుల్లయ్య. ట్రెజరర్ జె సంతోష్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comment List