మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

On
మధుయాష్కి గౌడ్ కు తృటిలో తప్పిన ప్రమాదం..

మధుయాష్కి గౌడ్ కు

IMG-20240505-WA0119
మధుయాష్కి కారు ప్రమాదం జరిగిన దృశ్యం..

తృటిలో తప్పిన ప్రమాదం..

ఎల్బీనగర్, మే 05 (న్యూస్ ఇండియా ప్రతినిధి): టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. అనుకోకుండా అడ్డువచ్చిన  బైకును తప్పించే క్రమంలో.. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు గురైనప్పటికీ.. డ్రైవర్ ముఖేష్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ తల్లి మరణించడంతో.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు  ఆదివారం ఉదయమే మధుయాష్కి గౌడ్ గారు  వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో ఆలేరు వద్దకు వెళ్ళగానే బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అనుకోకుండా  అడ్డుగా వచ్చారు. బైక్ పై ఉన్న ఆ వ్యక్తులను కాపాడే క్రమంలో.. కారును డ్రైవర్ పక్కకు తిప్పగా  డివైడర్ను ఢీ కొట్టి కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో  మధుయాష్కి గౌడ్, కారులోని ఇతరులకు స్వల్ప గాయాలు మినహా ప్రాణాపాయం తప్పడంతో .. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 'దేవుడి దయవల్ల స్వల్ప గాయాలు మినహా  ఎవరికి ఏమి కాలేదు ' అని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
*డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*  *ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు  రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు...
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి
న్యూస్ ఇండియా కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
మినీ ట్యాంక్ బండ్ కళ ఇకనైనా నెరవేరేనా
మోసపూరిత హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
అమ్మ ఆదర్శ పాఠశాల పనులు స్కూల్స్ ప్రారంభం వరకు పూర్తి కావాలి